ఆస్పరి తొగలగల్లుకు చెందిన అహోబిలాన్ని భార్య గంగావతి హత్య చేయించినట్లు, మంగళవారం పోలీసులు వెల్లడించారు. ప్రియుడు చెన్నబసవతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని పథకం పన్నింది. ఈ నెల 3న భర్తతో కలిసి కల్లపరికి వెళ్లింది. భర్త తిరుగు ప్రయాణం అవ్వగా.. అప్పటికే దారిలో కాపుకాసిన చెన్నబసవ గొంతుకోసి చంపేశాడు. కేసు నమోదు చేసి గంగావతి, చెన్నబసవను అరెస్టు చేశామని ఎస్సై గంగాధర్ తెలిపారు.