పొదుపు సమైఖ్యకు కూటమి చేయూత ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం పాణ్యం మార్కెట్ యార్డ్లో జరిగిన స్త్రీశక్తి కార్యక్రమంలో మహిళలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. శనివారం పొదుపు మహిళా సమైఖ్యకు రూ.5.10 కోట్లు విలువైన మెగా చెక్కును అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్, గౌరు జనార్దన్ రెడ్డి, పార్వతమ్మ పాల్గొన్నారు.