Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: రాచర్ల మండలంలో 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపిన ఎస్సై కోటేశ్వరరావు

Giddalur, Prakasam | Sep 11, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో సెప్టెంబర్ 30 తేదీ వరకు 30 యాక్ట్ అమలులో ఉందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మీడియాకు గురువారం ఉదయం 11 గంటలకు తెలిపారు. 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఊరేగింపులు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని తెలిపారు. అలా ఎవరైనా కార్యక్రమాలు చేయదల్చుకుంటే పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా కాదని నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కోటేశ్వరరావు ప్రజలను హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us