Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: పోరుమామిళ్ల : భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే నిరూపించాలి - మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి

India | Sep 12, 2025
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా టీవీ చానళ్లు,పత్రికల్లో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు.తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని, వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.కొంతమంది వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us