నరసరావుపేట శివారులోని ప్లాస్టిక్ వ్యర్థాల గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించన ఘటన అలెస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ప్లాస్టిక్కు అంటుకోవడంతో ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.