నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోందని బుదవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు.ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 1521 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 697.375 అడుగులు 4.056 టీఎంసీలలో నీటి సామర్థ్యం కొనసాగుతుంది. ఎడమ కాలువకు 866 క్యూసెక్కులు, కుడి కాల్వకు 15 క్యూసెక్కుల నీటిని సాగుకు వదులుతున్నామన్నారు. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.