కోనసీమ వ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమలాపురంలోని కలెక్టరేట్ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 8.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ముమ్మిడివరం మండలంలో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.