Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించిన ఏపీ నిరుద్యోగ జేఏసీ

India | Sep 11, 2025
ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కూట‌మి ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త ర్యాలీని గురువారం విశాఖ‌లో నిర్వహించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలకు, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు యువత పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచింది.
Read More News
T & CPrivacy PolicyContact Us