ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామంలోని ఓ వే బ్రిడ్జిలో పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి కాంటా వద్ద విధులు నిర్వహిస్తున్న క్రమంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో పాటు, కాలు విరిగినట్లు తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించామన్నారు.