కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, స్టోర్రూమ్, భోజన సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్యం, హాజరు తదితర అంశాలను పరిశీలించారు. వసతి గృహం కోసం నిర్మిస్తూ, ఆగిపోయిన అసంపూర్ణ భవనాన్ని నిర్మిస్తామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు చొరవ చూపాలని సూచించారు.