ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు మాదిరెడ్డిపాలెం గ్రామాలలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాజకీయ స్వార్థం కోసం మాదిరెడ్డిపాలెం కంబాలపాడు నంది పాలెం గ్రామాలను పొదిలి గ్రామపంచాయతీలో విలీనం చేశారన్నారు. దీంతో ప్రజలకు ఉపాధి హామీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఈ విషయంపై కోర్టు కు వెళ్లడంతో స్టే ఇచ్చిందని తెలిపారు.