నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ను గురువారం ఆయన నివాసంలో నియోజకవర్గ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.