దళితులను విభజించడం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం తిరుపతి జిల్లా గూడూరుకు చేరుకుంది. దానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపి, అనంతరం ఆయన 4 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కెల్లా గొప్పదని ఆయన కొనియాడారు.