Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రజలకు, అధికారులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసినట్లు సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించుకోవాలన్నారు, తద్వారా కాలుష్య నివారణ కొనసాగుతుందని, భావితరాలకు బాటలు వేసిన వారు అవుతారని,కావున ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించుకోవాలన్నారు జీఎం రాజేశ్వర్ రెడ్డి.