సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ, దిగువ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలు సోమవారం ఉదయం తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనార్థం అవకాశం కల్పించారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది.