పెద్ద కడబూరు:ఉపాధి హామీ పథకంలో పెండింగ్ లో ఉన్న 8 వారాల వేతనాలు విడుదల చేయాలని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద కడబూరులోని మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద పరిపాలన అధికారి కౌసల్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ మండలంలోని విష జ్వరాలు ప్రబలాయని, నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని కోరారు.