Download Now Banner

This browser does not support the video element.

భీమడోలు రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతున్న ద్వారకాతిరుమల భక్తులు, స్థానిక గ్రామాల ప్రజలు

Eluru Urban, Eluru | Sep 10, 2025
భీమడోలు రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ద్వారకాతిరుమల భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రానికి 16 కి.మీ దూరంలోని భీమడోలు రైల్వేస్టేషన్ నుంచి వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారన్నారు. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరకొరగా ఆపడంతో దూరప్రాంత ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. కాకినాడ-తిరుపతి, జన్మభూమి, రత్నాచల్ రైళ్లను ఆపాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us