ఈనెల 22 నుంచి ఇంద్రకీలాద్రిపై జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాల నేతలు స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధులు ప్రజాసంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.