వినుకొండలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న ఎన్ఎస్పీ కాలువలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. మృతుడు ఎవరు, ఎలా చనిపోయాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.