లక్ష్మణచందా మండలం మునిపెల్లి గ్రామంలో వాగు ప్రవాహం అవతలి వైపు చిక్కుకుపోయిన పశువుల కాపరిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సంఘటన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎన్డిఆర్, ఎస్ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో మాట్లాడి పశువుల కాపరిని సురక్షితంగా వెనక్కు తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలను వారితో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని అన్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు.