నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ వద్ద గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. మధ్యాహ్నం అటువైపు వెళ్లిన గ్రామస్తులకు నదిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెంది ఉంటాడని గుర్తించారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.