పవిత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వివాదాలలోకి లాగొద్దంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. శనివారం ఆయన నివాసం నుండి విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఈ సందేశాన్ని ఆయన తెలిపారు మార్కాపురం కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఉద్దేశంతో మంత్రివర్గ ఉప సంఘం ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారని ఆ కమిటీ పశ్చిమ ప్రకాశంలోని కొన్ని నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లాను ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుందన్నారు అంతే తప్ప పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలంటూ అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తూ వివాదాలు చేయొద్దు అన్నారు