ధర్మవరం పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దుర్గా నగర్ కు చెందిన ముత్యాలప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.