న్యాయవ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని.. దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకముందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సును ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని.. దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు.