కొమ్మాది జంక్షన్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి విశాఖకు వస్తున్న మినీ ట్రక్, ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టటం తో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మినీ ట్రక్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.