అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మకాలను అరికట్టాలని, రైతులకు యూరియా సకాలంలో అందుబాటులోకి తేవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని మార్మోగించారు.మదనపల్లి ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ...రైతన్నలు దేశానికి వెన్నెముక. వారికి యూరియా సమయానికి అందకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. బ్లాక్ మార్కెట్లో యూరియా మాయమవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు