వాజేడు మండలం టేకులగూడెంలోని రేగుమాకు వాగు వద్ద గోదావరి నీటి మట్టం తగ్గడంతో రాకపోకలు నేడు శుక్రవారం రోజున ఉదయం నుండి యథావిధిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ మధ్య ఉన్న ఈ వాగు ప్రవహించడంతో గత కొన్ని రోజులుగా రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఈరోజు తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు.