డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో బీమా కింద రూ.5లక్షలు మంజూరైంది. ఆ మొత్తాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. పార్టీకి సేవలందించిన నేతల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.