ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమంలో మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురి నుంచి భూ సమస్యలు, ఆన్లైన్ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.