Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Sircilla, Rajanna Sircilla | Aug 23, 2025
పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో 2,000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఇట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us