అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ 50% సుంకాల విధింపును నిరసిస్తూ మలికిపురంలో శనివారం ధర్నా చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సీపీఐ నేత దేవ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రుద్రరాజు గోపాలకృష్ణం రాజు, చిలకపాటి శ్రీధర్, అప్పారి శ్రీనివాస్ పాల్గొన్నారు.