కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాక్షిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించారు. సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ లో ఈవీఎంలను భద్రపరిచిన గదులను తెరిచి ఇవియం బాక్స్లను పరిశీలించి మళ్లీ గదులను సీల్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాక్షి తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ లో రక్షణ చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని తెలిపారు.