భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ పాఠశాల, కళాశాల ముందు మంగళవారం ఉదయం 9 గంటలకు తమకు జీతాలు చెల్లించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టినట్లు అవుట్సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,వెంటనే ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.