కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎం విద్యా సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని డెమో చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీ డిఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ కు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు ట్రిపుల్ ఐటి డిఎం ప్రొఫెసర్లు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను రూపొందించడం పూర్తి అయిన నేపథ్యంలో ఒక గ్రామంలో