మంత్రి సవిత మాజీ సీఎం వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్యలను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఖండించారు. మంగళవారం మధ్యాహ్నం పెనుకొండలో ఆమె మాట్లాడారు. 'మంత్రి సవిత నోరుకు హద్దూ అదుపు లేకుండా పోయింది. విజయవాడ, హైదరాబాద్కు తేడా తెలియని దద్దమ్మ మంత్రి సవిత' అంటూ ఫైర్ అయ్యా రు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని పేర్కొన్నారు. మరోసారి జగన్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.