అనంతపురం నగర శివారులోని సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద కుక్కర్ అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో షేక్షావలి అనే యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.