ఈనెల 29న బేతంచెర్ల నగర పంచాయతీ వార్డు కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ చలం రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరి ప్రసాద్ బుధవారం తెలిపారు. పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన వార్డు కౌన్సిలర్లు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు. ఇందులో వార్డులో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.