Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: రానున్న నవరాత్రుల సందర్భంగా ప్రజలకు సురచితమైన వాతావరణం కల్పించాలి : కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

Ibrahimpatnam, Rangareddy | Sep 8, 2025
సరూర్నగర్ లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సోమవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ రానున్న నవరాత్రుల సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద విద్యుత్ వైర్లు ఊగుతూ ఉండడంతో ప్రమాదాలు జరగకుండా కేబుల్స్ను సరిచేయాలని సూచించారు. సరూర్నగర్ డివిజన్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందుగానే స్పందించి సురక్షితమైన వాతావరణం ప్రజలకు కల్పించాలని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us