సరూర్నగర్ లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సోమవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ రానున్న నవరాత్రుల సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద విద్యుత్ వైర్లు ఊగుతూ ఉండడంతో ప్రమాదాలు జరగకుండా కేబుల్స్ను సరిచేయాలని సూచించారు. సరూర్నగర్ డివిజన్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందుగానే స్పందించి సురక్షితమైన వాతావరణం ప్రజలకు కల్పించాలని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.