అన్నమయ్య జిల్లాకు కలెక్టర్ శ్రీ చామకూరి శ్రీధర్ గత ఒక సంవత్సరం మూడు నెలల కాలంలో ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టర్ బదిలీ కావడం ప్రజలకు బాధకరమని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయడం ద్వారా కలెక్టర్ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించారని గాజుల ఖాదర్ బాషా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన శ్రీధర్ కి శాలువా కప్పి ఘనంగాసత్కరించారు.