ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మొత్తo 515 అర్జీలు అందాయన్నారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 221 , పోలీస్ శాఖకు 71 , మున్సిపల్శాఖకు సంబంధించి 46, సర్వేకు 31, పంచాయతీరాజ్ శాఖకు 41 అర్జీలు అందాయని వివరించారు. ఫిర్యాదుదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని కలెక్టర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆదేశించారు.