మంచిర్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతంలో మంజూరైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 330 ఇళ్లను నిర్మించామని, లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ప్రభుత్వం మారాక లబ్ధిదారుల జాబితాను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.