కర్నూలు మార్కెట్ యార్డుకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి బుధవారం ఉదయం 12 గంటలు ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక నిమజ్జనం (4వ తేదీ), మిలాద్-ఉన్-నబి (5వ తేదీ) వేడుకల నేపథ్యంలో మార్కెట్ యార్డు మూసివేస్తున్నామని తెలిపారు. ఈ రోజుల్లో పంటల కొనుగోళ్లు ఉండవు. సెప్టెంబర్ 6నుంచి మళ్లీ క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.