ప్రజల ఆరోగ్యానికి ఎంత ఖర్చుకైనా ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తెలిపారు. గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలిపారు