కార్వాన్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో 79 మంది లబ్ధిదారులకు 3080500 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ శనివారం మధ్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేద ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.