రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక ధరలకు అంబులెన్స్ నిర్వహిస్తున్న వారి దందాతో మాకు సంబంధం లేదని శ్రీ గోదావరి అంబులెన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బొంత శ్రీహరి స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరుగుతున్న అంబులెన్స్ల దోపిడీ ప్రభుత్వం అరికట్టాలని కోరారు.