మానసిక వ్యక్తులకు చట్టపరమైన సేవలు అందించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వ పరంగా అందించాల్సిన రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సౌకర్యాలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.