అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బాటలో కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోను ప్రైవేటు అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో పామిడికి చెందిన నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.