ములుగు జిల్లా కేంద్రంలో సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం అంటూ ఉద్యోగులు నేడు సోమవారం రోజున ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.