పాణ్యం మండలంలో బుధవారం NH,40 జాతీయ రహదారిలో కారు డివైడర్ ను ఢీకొని అవతలి వైపు రోడ్డుపై బోల్తాపడడం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైవే పెట్రోలింగ్ పార్టీ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా క్లియర్ చేశారు.