దిగువ నుంచి ఎగువ అహోబిలం వరకు భరత నాట్య ప్రదర్శన నెల్లూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థిని భవ్య హాసిని మంగళవారం అహోబిలంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వరకు నాట్యం చేసి భక్తిని చాటుకున్నారు. యువతి మాట్లాడుతూ.. 'మహా సంకల్పం' కార్యక్రమంలో భాగంగా పలు పుణ్య క్షేత్రాల్లో నాట్య ప్రదర్శనలు చేస్తున్నానని తెలిపారు. ఇటీవల అరుణాచలంలో 14 కి.మీ గిరి ప్రదక్షిణను నాట్యంతో పూర్తి చేసినట్లు చెప్పారు.